శ్రీ సువర్చ లాంజనేయం -8
ర్చ
81-ఏవం నిశమ్య హనుమాన్ –క్షణం నిమీలిత నేత్రో హ్రుచ్చిత్వా
సీతా శ్రీరామచంద్ర –లక్ష్మణ సంస్థితి మదర్శయత్ .
తా – నారద తుంబుర ప్రార్ధన విని హనుమ క్షణ కాలం నిమీలిత నేత్రుడై ,హృదయ కుహరం విప్ప జేసుకొని శ్రీ సీతా రామ లక్ష్మణుల దర్శనాన్ని వారిద్దరికీ ఇచ్చాడు .
82-తాభ్యాం గర్వ సుస్టూత్యక్త –తత్రాధిక ప్రసంగో ముక్తః
శ్రీ రామ ఇత్యనరారతముక్తః –హనుమాన్ త్రుస్తో వక్తు మశక్తః
తా-వెంటనే వారిదరి గర్వం ఖర్వమై ,అధిక ప్రసంగాన్ని ఆపేశారు .శ్రీరామనామ సంకీర్తన చేసి హనుమకు ఆనందాన్ని చేకూర్చారు .
83-శ్రీరామ నామ సద్భాజనేన-తచ్చైల వనం సనాతనేన
సంయగ్ధ్వనితం ప్రతిస్వనేన –సర్వం భువనం పూత మనేన .
తా –అలా వారిద్దరూ శ్రీ రామ నామ భజన మధురాతి మధురంగా చేయగా శైల వనాంతరం అంతా ప్రతిధ్వనించి ,మూడు లోకాలను పవిత్రం చేస్తోంది .
84-హృదయే దైవం కః స్థాపయతి –హృదయం చిత్వా కో దర్శ యతి
గానేన శిలాః కో ద్రావయతి –సమహాన్ హనుమానేకో జయతి .
తా-హృదయం లో ప్రతిస్టింప బడిన దైవాన్ని తెర తీసి నట్లు హృదయాన్ని చీల్చి దర్శన మిప్పించి,తన అఖండ గానమహిమతో కఠిన శిలలని కరగించిన హనుమ ఒక్కడే జయ శాలి .
85-సద్భజన పరా బహవస్సంతి- .సజ్జాప నిష్టా బహవస్సంతి
వేదా సక్తాబహువస్సంతి-హనుమత్తుల్యాః కతి వా సంతి .
తా –సద్భజనానంద కరులు ఎదరౌన్నారు .జప నిస్టాగరి స్టూలూ చాలా మంది ఉన్నారు .కాని శ్రీ హనుమత్ప్రభువు కు సాటి యైన వారేవ్వరున్నారు ?అంటే ఎవ్వరూ లేనే లేరు .
86-సుస్థిర చిత్తో యః కో ప్యస్తి –బ్రహ్మ చారీయః కో ప్యస్తి
జీవన్ముక్తోహః కో ప్యస్తి-హనుమత్తుల్యో నైకో పస్తి .
తా –అలాంటి నిశ్చల చిత్త భాక్తాగ్రగాన్యుడు ,అలాంటి నిష్కల్మష బ్రహ్మ చారి ,అట్టి నిరామయ జీవన్ముక్తుడు అయిన శ్రీ హనుమ కు సాటి మరొకడు లేడు.
87-ప్రబోదనే యస్య ణ సంతోషః-సమాచారాన ఏవ యస్య తోషః
అత ఏవ రామ చంద్రే తోషః-తాదృశ భగవాన్ హనుమానేషః.
తా –పరులకు ఉపదేశం చేసి నంత మాత్రం తో సంతోషం రాదు .స్వీయ ఆచరణలోనే సంతోషం పొందగలం .మహా మహిమాన్వితులలో నిగూఢం గా శక్తి నిలిచి ఉంటుంది అని నారద తుంబురు లిద్దరూ గ్రహించారు .
88-శ్రీరామ పదే సంపశ్య౦తం –మందిర హృదయే వందన వంతం
బహిస్చ దృష్ట్వా శ్రీ హనూమంతం –తౌ మే నాతే మహిమా వంతం .
తా –తన హృదయం అనే మందిరం లో నూ ,బయటనూ ,శ్రీరామ పాదారవింద సన్నిధి లోను వినమ్రుడై వందనం చేసే శ్రీ హను మంతుని దర్శించి మహా మహిమాన్వితునిగా అర్ధం చేసుకొన్నారు మునులిద్దరూ .
89- హ్రుచ్చేదనం కద మితి-క్షణం సమాలోచ్య ,ప్రాజ్య మహిమ్నాం
మహతీ శక్తి ర్గూఢా-స్వాదితి మౌనిద్వాయ మేనే .
తా –మారుతిలాగా హృదయాన్ని చీల్చటం ఎలా సాధ్యం ?అని క్షణకాలం ఆలోచించి మహా మహిమ గల మహనీయులలో శక్తి నిగూఢం గా ఉంటుందని నారద తుంబురు లిద్దరూ గ్రహించారు .
90-బ్రహ్మాది సురా మునయః –సస్త్రీ కాస్తద్భూతల మావ తేరుః.-
సత్పుష్పాణి వవర్షుః –శ్రీ రామాలయ కాపే శీర్షే .
తా-బ్రహ్మాది సకలదేవతలు తమ దేవేరులతో సహా భూమిమీదకు శ్రీ రామాలయం గా రూపొందిన శ్రీ హనుమంతుని శీర్ర్షం పై మహదానందం తో పుష్ప వృష్టి కురిపించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-12-14-ఉయ్యూరు