దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –
39- మద్ది ఆంజనేయ స్వామి
పశ్చిమ గోదావరిజిల్లా జంగా రెడ్డి గూడెం మ౦డలం గురువాయి గూడెం గ్రామం లో తెల్ల మద్ది చెట్టు కింద పూజలు అందుకొంటున్న స్వామినే మద్ది ఆంజనేయ స్వామి అంటారు .స్వయంభువు సుప్రసిద్ధుడు .త్రేతాయుగం లో మధ్వాసురుడు అనే రాక్షసుడు రావణ సైన్యం లో ఉండికూడా శ్రీ ఆంజనేయస్వామిని చూసి ఆయన లో ఐక్యమయ్యాడు .ద్వాపర యుగం లో మద్వి కుని గా జన్మించి కౌరవుల తరఫున కురుపాండవ యుద్ధం లో పాల్గొన్నాడు .అర్జునుని రధ ధ్వజం పై ఉన్న హనుమాన్ ను దర్శించి ప్రాణాలు విడిచాడు .కలియుగం లో మధ్వడుగా పుట్టి అనేక వేల ఏళ్ళు తపస్సు చేశాడు .ఆధ్యాత్మిక భావం తో జీవించాడు. ప్రక్కనే ఉన్న ఎర్రకాలువ ఒడ్డున నివాసం ఏర్పరచుకొని తపస్సు చేశాడు .ప్రతి రోజు కాలువ స్నానం చేసి ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉన్నాడు .ఒక రోజు అలా చేస్తుంటే కాల్వ లో పడబోయాడు .ఎవరో చేయి పట్టుకొని ఆపేసి నట్లు ఆగిపోయాడు .ఎవరా అని చూస్తె ,ఒక వానరం అలా చేసినట్లు గ్రహించాడు .ఆయనే సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామియే అనుకొన్నాడు .ఆ కోతి మధ్వుడిని ఆశ్రమానికి చేర్చి సపర్యలు చేసి ఉపశమనం కలిగించింది .స్వామి అనుగ్రహం లభించిందని సంతోష పడ్డాడు .తానూ ఇంతకాలం స్వామి చేత సపర్యలు చేయిన్చుకొన్నందుకు బాధ పడి స్వామిని శరణు వేడాడు .ఇక తానూ జీవించటం వృధా అని పాదాల పై పడ్డాడు .అప్పుడు స్వామి అనుగ్రహం తో ప్రత్యక్షమై జరిగిన దానిలో మధ్వుని తప్పు ఏమీ లేదని ఆతని భక్తికి మెచ్చి తానె సపర్యలు చేశానని స్వామి చెప్పాడు .వరం కోరుకోమన్నాడు .మధ్వు డు ఎల్లప్పుడు తన చెంతనే ఉండేట్లు వరం ప్రసాదించ మని కోరుకొన్నాడు .స్వామి ‘’నువ్వు ఇక్కడే మద్ది చెట్టు రూపం లో అవతరించు .నేను ప్రక్కనే ఒక చేతిలో ఫలం మరో చేతిలో గద తో శిలా రూపం గా అవతరిస్తాను .ఈ పుణ్య క్షేత్రం నీ పేరుతొ ‘’మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం’’గా వర్ధిల్లుతుంది ‘’అని అనుగ్రహించాడు . కనుక స్వామి స్వయంభు గా భావిస్తారు .
ఆలయానికి శిఖరం ,పైకప్పు లేవు .మద్ది చెట్టు బాగా పెరగటం వలన విమానం కట్టటానికి అవకాశం లేదు. భక్తులు కోరిక నేర వేరిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తారు .దీనికి పడమర పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయమూ ఉంది .ఏడు మంగళ వారాలు వారానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి .కుటుంబ ,ఆర్దికాది సమస్యలూ తొలగిస్తాడు .ఏలిన నాటి శని దోషాలు నివారింప బడి అంతాశుభమే జరుగుతుంది .
40 –
40- బీచుపల్లి ఆంజనేయ స్వామి