శ్రీ సువర్చ లాంజనేయం -3
31-యుష్మద్ధ్రుదయే రామో రమతే త్వత్సమ భక్తో నప్లవగ పతే
కపిరప్యచలో సిత్వం సుమతే-నిత్యాద్భుత నూతన భక్తి గతే.
తా—‘’కపివరా!నీహృదయం అంతా రామనామ మయం .కోతి చపలుడు అనే మాట నీకు చెల్లనే చెల్లదు .నవ నవోన్మేషణం నీ భక్తి తత్పరత .నీసమాన భక్తుడులేడు.
32-త్వమేవ శక్తో వీణోద్ధరణే-తే భక్తిర్వా శక్తోద్ధరణే
తే మహిమార్హః స్యాదుద్ధరణే-నావం శక్తౌ వీణౌ ద్ధరణే.
తా—ఈ వీణలను ఉద్ధరించే శక్తి మాకు లేదు .వీటిని ఉద్ధరించే భక్తీ శక్తులు మహిమా నీకే ఉన్నాయి హనుమయ్యా .
33 ఏతచ్చ్రుత్వా హనుమాన్ –సర్వ సమర్దః సర్వం కర్తుం సం
శక్తః శ్రీరామ ఏవ –భవతీత్యు వాచా నమస్కుర్వన్ .
తా-ఈ మాటలు విన్న హనుమాన్’’ అయ్యా!సర్వ సమర్ధుడు ,సమస్త సృష్టీచేసి పాలించేవాడు శ్రీరామ చంద్రుడు ఒక్కడే ‘’ అని వినయంగా చెప్పి శ్రీ రాముని తలచుకొని నమస్కరించాడు .
34-యువ యోర్మయి సర్వత్రా ప్యేకం-దైవం విలసతి తచ్చానేకం
తత్సం స్తోతుం సర్వం మూకం –సూక్ష్మాత్సూక్ష్మం మహతో స్తోకం .
తా-మీలో నాలో ,అంతటా నిండి ఏకమై ,సూక్షాతి సూక్షం గా ,అనంతంగా వెలిగే ఆ పరబ్రహ్మ అయిన దైవాన్ని మనం వర్ణించలేము .
35-పుణ్యే లోకే యుష్మ దదీతాం –తాం సన్మధురాం గాంధర్వ కృతాం
తాం పుణ్యజనాప్తాం సంగీతాం-శ్రోతుం వాంచామ్య మరాభి మతాం.
తా-పుణ్య లోకాలన్నీ మీ అధీనం లో ఉన్నాయి .మీరు నేర్చుకొన్న మధురాతి మధురగానం విని భక్తులు తరిస్తారు .అలాంటి గానాన్ని నాకు వినిపించి క్రుతార్దుడిని చేయండి .అని హనుమ వారిని వేడాడు .
36 ఏతద్వాక్యం శ్రుత్వా –శ్రీనారాయణ పవిత్ర పదాంకితం
గీతా మగాయతాం తౌ –మధుర స్వర సత్క్రమోపేతాం .
తా-హనుమ ప్రార్ధన విని మునులిద్దరూ శ్రీమన్నారాయణ దివ్య వచన సమన్వితమైన గానాన్ని ఆలాపించటం ప్రారంభించారు .
37 –శ్రీహరి మనిశం దారయ హ్రుత్వం –పరమాత్మానం సదా భజత్వం
సర్వ మసత్యం విద్ధి జగత్వం –నిత్యం సత్యం భగవత్తత్వం .
తా-ఓమనసా!సదా శ్రీహరిని స్మరించు పరమాత్ముని సేవించు .ఈ కనబడే జగత్తు మిధ్య .భగవత్తత్వం ఒక్కటే నిత్యమైనది .
38 –ఏవం మునీ పరవశం-స్వగాయతా మాపి బహుదా తత్సమయే
శిలే ,న మ్రుదుతాంప్రాప్తే –చలనం నాప్తే చ తే వీణే.
తా-నారద తుంబురు లిద్దరు అనేక విధాల పరవశత్వం తో గానం చేసినా , శిలలు ఏమాత్రం మెత్త పడలేదు .వీణలు కించిత్తుకూడా సడల లేదు .
39-రామం హృది పశ్యంతం –శ్రీ కపి ముపెత్య తన్మౌ నిద్వంద్వం
గర్వం త్యక్త్వా ప్రణమ్య-వినమితి శీర్షం స్తుతిం చక్రే .
తా-ఎల్లప్పుడూ హృదయం లో శ్రీరామ చంద్రుని దర్శించే కపి వరుడైన అ హనుమ ముందు తమ కుప్పి గంతులు పనిచేయవని తెలుసు కొని గర్వాన్ని వదిలేసి మునులిద్దరు భక్తి ప్రపత్తులతో ముకుళిత హస్తులై హనుమను ఇలా స్తుతించారు .
40 –హనుమా నుత్దాయ భక్తి–భరితో వినమ్రతో బహు మొద మనాః
వీణా ద్వన్ద్వముపసృత్య –రామేత్యుక్త్వా సమస్తా వీత్ .
తా-అప్పుడు భక్తీ సంతోషాలతో ఆ నారద ,తుంబురుల వీణలపై తన దృష్టిని ఒక సారి ప్రసరింప జేసి ‘’శ్రీరామ ‘’అంటూ అనేక సార్లు .జపం చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -24-12-14-