శ్రీ సువర్చలాన్జనేయం -2
11-యస్మిన్ శీతోస్తి కృష్ణ వర్త్మా-యం ఖే గమయతి సమీరణాత్మా
సయయే యస్సూక్ష్మ స్తూలాత్మా –సోయం శ్రీ హనుమాన్ పరమాత్మా
తాత్పర్యం –ఎవరికి అగ్ని చల్లగా ఉంటుందో ,ఎవరు ఆకాశం లో గాలిలో విహరిస్తారో ,ఎవరు సమయానుకూలంగా సూక్ష్మ అతి సూక్ష్మ రూఒపాలు దరిస్తారో అలాంటి పరమాత్మ శ్రీహనుమత్ప్రభువు .
12-భక్తిస్చేత్కిం స్వాధ్యాయేన –స్మరణం చేత్కింమంత్ర జపేన
ఆర్తిస్చేత్కిం శుచితాపేన – లయతా చేత్కీంస్తుతి పఠనేన.
తా—భక్తీ లో మునిగిన వాడికి వేదం పఠఠనం ఎందుకు?ఆర్త హృదయం ఉంటె ప్రాయశ్చిత్తం దేనికి?భక్తీ తో ఆనంద నాట్య మాడేవానికి స్తోత్ర పాఠాలేల?
13-శబ్దార్ధ వ్యాక్రుతి విష యేషు –భక్త్యా వేశప్రోల్లాశేషు
భక్త శిఖండిః దుస్సంగేషు –హనుమత్తుల్యో నహి లోకేషు .
తా-వ్యాకరణం లోను భక్తీ ఆవేశం తో గంతులు వేయటం లో ,భక్తీ ప్రభావం లో దురితాల ధూళిని వదిలించటానికి హనుమంతునికి సాటి ముల్లోకాలలో ఎవరూ లేరు .
14-రామేత్యను పద ముద్గాయంతం –సులలిత సురుచిర పదోచ్చలంతం
కృత కరతాళం శిరసి వహంతం –ప్రణ మానస్సంతం శ్రీ హనుమంతం .
తా—అనుక్షణ రామ నామ గానలోలుడై ,కరతాళ ధ్వనులతో సుందర పదార విందాలతో గంతులేస్తూ రెండు చేతులు జోడించి శిరస్సున ఉంచుకొనే శ్రీహనుమంతునికి వందనం .
15-శ్రీరమేత్యాలాప పదాని –మునీంద్ర వీణా శిలాతలాని
కృత్వా సంయగ్ద్రవ రూపాణి-చక్షుర్వీణే లగ్నేతాని .
తా—శ్రీరామ అనే పదం ఆలాపిస్తే శిలా తలాలు కరిగి పోతున్నాయి .వాటికి ఆనించిన వీణలు కరిగిన ఆరాతి ద్రవం లో చిక్కుకోన్నాయి .
16-సమ సమతాం హనుమతే నితాంతం సమ విశదయతాం హర్ష స్వాంతం
వ్యస్మరతాం స్వాగమ వృత్తాంతం –సమ పశ్యతాం స్వ వీణా క్రాంతం .
తా—అలాశిలా ద్రవం లో చిక్కుకు పోయిన వీణలను గురించి ఆలోచిస్తూ తాము వచ్చిన పని మరిచిపోయి నారద ,తుంబురులు తమమనసు పొందిన ఆనందాన్ని తెలియ జేస్తూ వినయంగా వంగి నమస్కరిస్తున్నారు .
17- తం కపి వర్యం మౌనిఖ్యాతౌ –దృష్ట్వా దృష్ట్వా సమ్యక్ ప్రీతౌ
భక్త్యా ముకుళిత హస్తౌ జాతౌ –తౌ ద్వౌ కృతార్ధ తామాయాతౌ ‘’
తా-ఆ విధంగా ఆ ఇద్దరు మునులు కపివరుని చూసిన కొద్దీ ప్రేమ పొంగి ,చేతులు జోడించి నిలబడి తమ జన్మలు సార్ధక మైనట్లు భావించారు .
18-రామాలాపం విరతం కృత్వా –హనుమాన్ తౌ గాపయితుం మత్వా
ఉభౌ యువాం గాయత మిత్యుక్త్వా –తిస్టతి కరతాళం గమయిత్వా .-
తా—అప్పుడు హనుమ శ్రీరామ గానాలాపం ఆపి ,ఎదుట అత్యంత విధేయంగా నిలబడిన ఆ ఇద్దరు మునులను రామనామ గానంచేయమని ,తాళాలు అందజేయటానికి సిద్ధం గా ఉన్నాడు .
19-ఆదౌ తుంబుర ఉవాచ –భక్త్యర్దీవ సముత్తిస్టన్ ప్రీత్యా
సంజ్ఞ ప తేశ్రీ కపయే –సన్నమితాంగః కృతాంజలిః.
తా—మొదటగా తుంబురుడు భక్తీ ఆవేశం కలగలుపుగా నమస్కారం చేసి శ్రీ హనుమత్ప్రభువుతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు ,
20 –నిరస్త సమస్త దురిత వ్రాతం –మామిహ విద్యా గర్వా పేతం
సుజన వినీతం సాదుపునీతం –కరోతి హనుమాన్ యుష్మద్గీతం .
తా-తుంబురుడు హనుమతో ‘’హనుమ స్వామీ!నువ్వు చేసిన భక్తీ గాన లహరి విశ్వ వ్యాప్తమై పాపాలన్నిటిని పటా పంచలు చేసింది . నావిద్యా గర్వాన్ని అణచి వేసింది .సుజనత్వాన్నిచ్చి పవిత్రుడిని చేసింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-14-ఉయ్యూరు